శ్రీకృష్ణదేవరాయలు బ్లాగులో కామెంటు రాయటం దాదాపు అసాధ్యంగా మారాక ఇక్కడ రాయక తప్పలేదు...
ఇరాక్ మీద యుద్ధం వద్దంటే సద్దాం హుస్సేన్ అనే సైనిక నియంతను సమర్దించినట్లు కాదు.బుష్ చేస్తున్న పనులు ప్రపంచప్రజా కంటకంగా ఉన్నాయి అంటే మనం వామపక్షాల సభ్యులం,సానుభూతిపరులం కానక్కర్లేదు. చిరంజీవికి రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఉంది అంటే మనం రేపు చిరంజీవి తరపున గోడ రాతలకు,వీధి ప్రచారాలకు దిగుతామని కాదు.దేశంలో ఆర్ధిక సరళీకరణ ప్రారంభమయ్యాక ఎన్నో విదేశీ కార్ల కంపెనీలు వచ్చాయి.వ్యాపారాలు విస్తృతంగ పెంచుకున్నాక కూడా ప్రమోద్ మహాజన్ని అడ్డంపెట్టుకొని మరే కొత్తవిదేశీకార్ల కంపెనీ రాకుండా ఎంబార్గో విధించమన్నారు.అలాగే ఉంది మీరు చెప్పేది.దేశాన్ని నాశనం చేస్తున్న రాజకీయనాయకులకు చట్టంలో లోపాలను చెప్పి తప్పుడుపనులు చేయించేది కూడా మేధావులు అనిపించుకునే ఐ ఏ ఎస్లూ వగైరాలే.మీరు చెప్పినట్లు రాజకీయమంటే ఒకేఒక్కడు సినిమా కాదు అలాగే పరుచూరి బ్రదర్స్ రాసే డయిలాగులు కూడా కాదేమో... మీ ఉద్దేశ్యంలో మేధావులు నేరాలు చేయరు,నేరుగా ఆకాశం నుంచి ఊడిపడతారనే భ్రమలు మనదేశంలో ఎవరికీ లేవు.ఇప్పుడున్న ఎం ఎల్ ఏలలో మేధావివర్గానికి చెందినవారు లేరనా మీఉద్దేశం? ఉన్నా ఏమీ చేయట్లెదు ఎందుకంటే పాలనాయంత్రాంగం ఏఒక్కడిమీదో నడవదు కాబట్టి.రేపు జేపి వచ్చినా,చిరంజీవి వచ్చిన ఇదే కధ పునరావృతమవుతుంది. ప్రజాస్వామ్యమనే మహాసముద్రంలో ఎన్నో పార్టీలు వచ్చి కలుస్తుంటాయి.ఇప్పటికే రిజిష్టర్ అయిన పార్టీలు,ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి.వాటికి ఇప్పుడు చిరంజీవి పెడతాడనుకుంటున్న పార్టీ జతకావచ్చు,లేదా సమూల మార్పులు తీసుకు రావచ్చు.ఒకవేళ రేపు ఏపెద్దల సూచనల మేరకో జేపి,చిరంజీవి ఒకటిగా పోటీ చేస్తే????


2 వ్యాఖ్యలు:
చిరంజీవి కలవాల్సిన అవసరమేముంది...? తనకు పరిచయంలేని దానిలొ కాలు పెట్టడం కన్నా, తనకి మంచిని నిలబెట్టాలని ఉంటే, ఈపాటికే ప్రణాళికతో మార్గ దర్శకాలతో ముందుకొచ్చిన లోక్ సత్తా కి, జయప్రకాష్ నారాయణకి మద్ధతుగా ప్రచారం చేస్తే చాలు... చిరంజీవి ఆ విధంగా మార్పుకి సహకరించాడని చరిత్రలో నిలిచిపోతాడు... వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే మాత్రం లోక్ సత్తా కి లాభం కన్నా, దాని ఆదర్శాలకి నష్టం, అడ్డంకి అవుతాడు చిరంజీవి...
Nenu Deepu tho ekeebhavistaanu...
Post a Comment